సిరా న్యూస్, కుందుర్పి
నీటిని పొదుపు చేయండి
* విలువలబడి కోఆర్డినేటర్ లక్ష్మణమూర్తి
నీటిని పొదుపు చేయండి – మా భవిష్యత్తును కాపాడండి అని విలువలబడి కోఆర్డినేటర్ లక్ష్మణమూర్తి అన్నారు. కుందుర్పి మండల వ్యాప్తంగా సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విలువల బడుల విద్యార్థులు వివిధ గ్రామాలు అయిన అపిలెపల్లి, బెస్తరపల్లి, తూముకుంట, బసాపురం, జానంపల్లి, మాలయనూరు, ప్రపంచ జల దినోత్సవాన్ని ” ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈసందర్బంగా విద్యార్థులు ఆయా గ్రామాలలో ర్యాలీ నిర్వహించారు. “చెట్టును పెంచండి – పర్యావరణాన్ని సంరక్షించండి ” “నీటిని పొదుపు చేయండి – మా భవిష్యత్తును కాపాడండి ” అనే నినాదాలతో గ్రామాలలో ఊరేగింపు నిర్వహించి ప్రధాన కూడళ్లలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విలువలబడి కోఆర్డినేటర్లు లక్ష్మణమూర్తి బొమ్మలింగ రఘువీరా దిలీప్ శ్రీకాంత్ విలువలబడి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.