Lakshmana Rao: తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి

సిరాన్యూస్‌, చిగురుమామిడి
తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి
ప్రధానోపాధ్యాయులు పోలాడి లక్ష్మణరావు
* ఘ‌నంగా గురువులకు సన్మానం
విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులు పోలాడి లక్ష్మణరావు అన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు విద్యార్థులు శాలువాతో బుధ‌వారం  ఘనంగా సన్మానించారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.పది సంవత్సరాలు తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లడానికి తీర్చిదిద్దిన తమ గురువులకు ఎంతగానో రుణపడి ఉన్నామని విద్యార్థులు అన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించి తమకు గ్రామానికి తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కానుగంటి రాజమౌళి, శ్యామల, జోష్నా శంకరమ్మ, శంకర్, ప్రతిమ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *