సిరాన్యూస్,చిగురుమామిడి
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు: ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో టాటా బిల్డింగ్ ఇండియా వారి ఆధ్వర్యంలో రోల్ ఆఫ్ యూత్ ఇన్ బిల్డింగ్ ఏ స్మార్ట్ ఇండియా అనే అంశం పైన విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో సీనియర్స్ విభాగంలో ఫస్ట్ కె సమన్విత, సెకండ్ సాత్విక, థర్డ్ జశ్వద.జూనియర్ విభాగంలో ఫస్ట్ సాత్విక సెకండ్ యామిని, థర్డ్ సాహిత్య గెలుపొందారు.వారికి గోల్డ్, సిల్వర్, బ్రాంగ్ మెడల్స్ తో పాటు మెమోంటోలు అందజేశామని ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, టాటా బిల్డింగ్ ఇండియా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.