సిరాన్యూస్, ఓదెల
ఇద్దరి అంధులకు చూపును ప్రసాదించిన లక్ష్మి
ఓదెల మండల కేంద్రానికి చెందిన నేత్రదాత తాటికొండ లక్ష్మి (85)మృతి చెందగా ఆమె నేత్రాలను దానం చేయడం జరిగింది. నేత్రదానానికి ముందుకు వచ్చిన కుమారుడు చీకట్ల మొండయ్య భార్య అనసూయ, మనుమలు మనవరాడ్లను జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి అభినందించారు. కుటుంబం దుఃఖంలో ఉండి కూడా మరో ఇద్దరు అంధుల్లో వెలుగులు నింపిన వీరికి, నేత్రదాన కార్యక్రమానికి సహకరించిన టీ.కార్తీక్ (కానిస్టేబుల్), శ్రీమన్నారాయణ లను నేత్ర సేకరణ చేసిన ఎల్విపి సతీష్ను , ఫౌండేషన్ మిత్రులు క్యాతo వెంకటేశ్వర్లు, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, క్యాతం మల్లేశం, కొండ్ర వేణు, అల్లం సతీష్ వీరిని ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ మీడియా కార్యదర్శి కేఎస్ వాసు అభినందించారు.