Lakshmipati: నేత్రదానం చేసిన రైతు బిడ్డ లక్ష్మీపతి

సిరాన్యూస్‌, ఓదెల
నేత్రదానం చేసిన రైతు బిడ్డ లక్ష్మీపతి
ఆదర్శంగా నిలిచిన ఓదెల గ్రామ వ్యవసాయదారుడు
* నేత్రాలు సేకరించిన ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్
* అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు

వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది.. అగ్రికల్చర్ అనే మాటలో కల్చర్ ఉంది.. ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకేఒక్క వ్యక్తి రైతు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంకు చెందిన అలాంటి రైతు బిడ్డ కానుగంటి లక్ష్మీపతి(36) తన మరణంలో కూడా సమాజానికి, గ్రామానికి ఆదర్శంగా నిలిచారు. బుధవారం లక్ష్మీపతి ఆత్మహత్య చేసుకోగా, కొడుకును కోల్పోయిన దుఃఖంలో కూడా తల్లి లక్ష్మి, అన్న,వదిన భిక్షపతి-స్రవంతి సమాజ హితం కోసం మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడానికి మృతుని నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి భీష్మాచారి నేత ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ సీనియర్ టెక్నీషియన్ సతీష్ ద్వారా నేత్రాలను సేకరించి హైదరాబాద్ కు తరలించారు. ఇద్దరు అంధుల్లో వెలుగులు ప్రసాదించడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులతోపాటు సహకరించిన కానుగంటి రజినీకాంత్, గోపతి తిరుపతిని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రావణ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణా రెడ్డి, సలహాదారులు నూక రమేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్. లింగమూర్తి, జాతీయ కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు తదితరులు అభినందించారు. లక్ష్మీపతి అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. వీరిని ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ఓదెల మండల అధ్యక్షులు కొండ్ర వేణు. క్యాతం వెంకటేశ్వర్లు. డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు క్యాతం మల్లేశం మేరుగు సారంగం .అల్లం.సతిష్ .అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *