ఇరిగేషన్, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలి .

జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

 సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
నాగర్ కర్నూల్ జిల్లా ఇరిగేషన్, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఉదయం ఐ.డి. ఒ.సి. కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, రెవెన్యూ, జాతీయ రహదారి ఇంజనీర్లు, అధికారులతో భూసేకరణ, ఇరిగేషన్ పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు.ఎస్.ఎల్.బి.సి, పాలమూరు రంగారెడ్డి, ఉమామహేశ్వర రిజర్వాయర్, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వయర్, జాతీయ రహదారి పనులకు సంబంధించి, భూసేకరణ కారణంగా నిలిచిపోయిన పనులు, పునరావాస కేంద్రాల పురోభివృద్ధి, ఇతరత్రా సమస్యల పై చర్చించి పలు సూచనలు చేశారు.
పబ్లికేషన్స్, అడ్మిన్ కు సంబంధించిన బడ్జెట్ ఈ.ఎన్.సి. నుండి విడుదల చేయించాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు.అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి ప్యాకేజ్ 29 కింద అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్యాకేజ్ 30 కి సంబంధించి డి.పి.ఆర్ ప్రకారం అమొదిత అలైన్మెంట్ ప్రకారం పనులు కొనసాగించాలని సూచించారు. మార్కండేయ రిజర్వాయర్ పై సమీక్షిస్తూ భూసేకరణ పనులు పి.ఎన్. స్టేజ్ లో ఉన్నవాటిని అవార్డ్ స్టేజ్ కి తీసుకురావాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు.
దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న ముంపు బాధితుల కొరకు వారికి దగ్గరనే ఉన్న నల్గొండ జిల్లాలో పునరావాసం కల్పించేందుకు స్థలం కేటాయిస్తే ముంపు బాధితులతో మాట్లాడి తరలించడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ విషయంలో నల్గొండ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లాకు సంబంధిన ఈ. ఈ ఇరిగేషన్ ను సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి నుండి నంద్యాలకు వెళ్లే జాతీయ రహదారి జిల్లాలో 79.3 కిలోమీటర్లు మేరకు సాగనున్న రహదారి విస్తీర్ణ పనులకు 110 హెక్టార్ల భూసేకరణ కావలసి ఉండగా ఇప్పటివరకు 60 హెక్టార్ల భూ సేకరణ అవార్డు కాగా, ఇంకా కావలసిన 50 హెక్టార్ల భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేసి అందించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాకు మంజూరైన జాతీయ రహదారి వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ఇతరత్రా పనుల విషయంలో ఎప్పటికప్పుడు రెవిన్యూ, ఇరిగేషన్, జాతీయ రహదారి శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, కే సీతారామారావు, పాలమూరు రంగారెడ్డి ఎస్సి సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి నాగర్ కర్నూల్ ఆర్డిఓ రామ్ రెడ్డి, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు, అచ్చంపేట ఆర్డిఓ గోపిరామ్, కొల్లాపూర్ ఆర్డిఓ నాగరాజ్, ఇరిగేషన్ ఈఈలు మురళి, సంజీవరావు, జాతీయ రహదారి ఈఈ కల్వకుర్తి రాజేందర్, డి పి ఆర్ ఓ సీతారాం, వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులఏఈలు, డిఈలు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *