సిరా న్యూస్,రంగారెడ్డి;
నగర శివారు గండిపేట మండలం ఎం జి ఐ టి కళాశాల లో ఉదయం 9 గంటలకు జరగనున్న ఎంసెట్ పరీక్షలకు సమయం దాటుతున్న అధికారులు నిర్వహించకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళనలకు గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి అక్కడికి చేరుకున్న విద్యార్థులు ఇంకా కళాశాల గేట్లు తెరవకపోవడంతో గుంపులుగా గుమిగూడారు. ఇప్పటికైనా పై ఉన్నతాధికారులుఅధికారులు స్పందించి ఎంసెట్ ఎగ్జామ్ అనుమతించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. అలాగే కళాశాలలోని విద్యార్థులు తమకు వేసవి సెలవు ప్రకటించడం లేదని మరోవైపు విద్యార్థులు గత రెండు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు