సిరాన్యూస్, ఉట్నూర్
-పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట
-పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
-ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
-ఉట్నూర్ లో టీ-హాబ్ కేంద్రం ప్రారంభం
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీ-హబ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. టీ హబ్ కేంద్రం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయాల చికిత్సల నిమిత్తం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలలో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం, ఐటిడిఏ పిఓ కుష్బు గుప్తా, ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.