సిరా న్యూస్,ఒంగోలు
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు చీరాలకు చెందిన న్యాయవాది చెన్నుపాటి నాగేశ్వరరావు గా గుర్తించారు.బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆత్మహత్య లేకా ప్రమాదవశాత్తు మృతి చెందారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్సై జనార్ధన్ తెలిపారు