Laxmipur: లక్ష్మీపూర్‌లో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

సిరా న్యూస్, జైనథ్‌:

లక్ష్మీపూర్‌లో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచశీల్‌ జెండా ఆవిష్కరించి, బుద్ద వందన, ధమ్మ వందన, సంఘ వందన గావించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ… అంబేడ్కర్‌ రచించిన రాజ్యంగం వల్లనే బడుగు, బలహీన, దళిత, నిమ్న వర్గాల ప్రజలకు సమ న్యాయం, సమాజంలో సముచిత స్థానం దక్కిందన్నారు. ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగాన్ని దేశం కోసం రూపొందించిన అంబేడ్కర్‌ ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు భగత్‌ భీంరావ్, ఉపాధ్యాక్షులు భద్రె సుభాష్, ప్రధాన కార్యదర్శి భగత్‌ అశోక్, పంచశీల్‌ యువజన సంఘం సభ్యులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *