చిరుత దాడి

సిరా న్యూస్,పరిగి;
చిరుత దాడిలో వ్యక్తి గాయపడ్డ ఘటన గురువారం రాత్రి వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తి పెంటల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ గ్రామ సమీపంలో గిరిజన ఆశ్రమ పాఠశాల వెనకాల బహిర్భూమి కోసం వెళ్లిన శేఖర్ చెయ్యి పై చిరుత దాడి చెయ్యడంతో రక్త గాయాలు కావడం జరిగిందని అన్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. చిరుత అడవిలోకి వెళ్లినట్లు తెలిపాడు బాదితుడు శేఖర్. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత ఆనవాళ్లను గుర్తించి బోన్ లో బంధించి తీసుకువెళ్లాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *