భీమదేవరపల్లి, సిరా న్యూస్
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ ఏఎన్ఎం మహమ్మద్ శుక్ర ఆధ్వర్యంలో లెప్రసీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామస్తులతో లెప్రసీ ప్రేయర్ చేయించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం గీత, గ్రామ సర్పంచ్ గూడెల్లి రాజిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చింతరాజు, కార్యదర్శి రాజు, ఆశ కార్యకర్తలు ఎలిషా, భాగ్య, రాధిక తదితరులు పాల్గొన్నారు…