జైనథ్, సిరా న్యూస్
కుష్ఠు నిర్మూలన అందరి బాధ్యత
కుష్ఠు నిర్మూలన కోసం అందరు పాటుపడాల్సిన అవసరం ఉందని జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ నైనత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ ఉద్యోగులు, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ, ఆశ వర్కర్లతో నిర్వహించిన కుష్ఠు నిర్మూలన వారోత్సవాల సందర్భంగా పీ హెచ్ సీ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. కుష్ఠు వ్యాధిని నిర్మూలించాలన్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా కుష్ఠుకు చికిత్స తీసుకుంటే నియంత్రణలో ఉంటుందని తెలిపారు. వ్యాధిని ముందే గుర్తించి వైద్యం చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ప్రజలు కుష్ఠుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే నష్టాలు ఉండవని చెప్పారు.