-యూనియన్ ఉపాధ్యక్షులు మోహన్
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
మోటార్ సైకిల్ మెకానికర్ల సంక్షేమానికి అంతా సమిష్టిగా పనిచేసే అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని యూనియన్ ఉపాధ్యక్షులు నల్ల మోహన్ రావు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో తాడేపల్లిగూడెం మోటార్ సైకిల్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుల మాట్లాడుతూ సంఘ భవనం కోసం కొనుగోలు చేసిన స్థలంలో భవన నిర్మాణానికి అంతా తమ మద్దతు ప్రకటించాలని కోరారు. రాబోయే ప్రభుత్వానికి సంఘ అభివృద్ధికి పాటుపడే విధంగా సంఘ సభ్యులంతా పనిచేయాల్సి ఉంటుందని కోరారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సమిష్టిగా వారికి అండగా నిలబడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు చిన్నం చిన్న వెంకటరెడ్డి, గౌరవాధ్యక్షులు పసుపులేటి సత్యనారాయణ, కొమ్మిశెట్టి వెంకటరాజు,కార్యదర్శి సోము శ్రీను, కోశాధికారి పొన్నాడ సత్యనారాయణ ప్రసాద్, సహాయ కార్యదర్శి కెల్లా సత్యనారాయణ, సంఘ నాయకులు హాజరయ్యారు.
========================