సిరా న్యూస్,తిరుపతి;
రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామంటున్నారు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు పూజలు నిర్వహించి , అనంతరం టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అభినయన్ రెడ్డి 10,11 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరికి అడుగడుగునా ప్రజలు హారతులు పట్టి ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధితో పాటు తిరుపతిలో చేసిన అభివృద్ధికి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరింతగా తిరుపతిని అభివృద్ధి చేస్తామంటున్నారు భుమన అభినయ్ రెడ్డి. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సిపి నాయకులు ,కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
===================