సిరా న్యూస్,పరవాడ;
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈదులపాక బోనంగి గ్రామం నుండి అధికార వైయస్సార్సీపీ నుండి జనసేనలోకి పలువురు చేరారు. ఈదులపాకబోనంగి గ్రామం వైస్- సర్పంచ్ మేడశెట్టి వెంకట రమణ -వెంకట సత్యవతిలు తమ బృందంతో పెందుర్తి లో గల సుజాతనగర్ నందు న్న పంచకర్ల నివాసంలో పంచకర్ల రమేష్ బాబుని కలిసి పలు ముఖ్య విషయాలు చర్చించిన అనంతరం అధికార వైయస్సార్సీపీ నుండి జనసేన పార్టీలో చేరడం జరిగింది.ఈ సంధర్బంగ పెందుర్తి జనసేన శాసనసభ అభ్యర్థి అయిన పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ కండువా వేసి మేడశెట్టి వెంకట రమణ -వెంకట సత్యవతిల బృందం ను జనసేన పార్టీ లోకి సాధరంగ ఆహ్వాణించడం జరిగింది.ఈ సందర్బంగా ఈధులపాక బోనంగి ఉప- సర్పంచ్ మేడశెట్టి వెంకట రమణ -సత్యవతిల తో పాటు ఈదులపాక బోనంగి మాజి ఉప -సర్పంచ్ బొద్ధపు అర్జున నరసింగరావు, రాయి నీలబాబు, బొండా తారక రమేష్ కుమార్, మేడశెట్టి శంకర రావుల తో పాటు మరికొంత మంది జనసేన పార్టీ లో చేరారు.అనంతరం మేడశెట్టి వెంకట రమణ -సత్యవతి ల బృందం జనసేన పార్టీ లో కి చేరడానికి ముఖ్య పాత్ర పోషించిన జనసేన పార్టీ పరవాడ మండల అధ్యక్షులు మరియు ఈధులపాక బోనంగి గ్రామ సర్పంచ్ బొద్దపు శ్రీనివాస్ కాసుల తో పాటు ఇతర జనసేన మండల, జిల్లా మరియు రాష్ట్ర ముఖ్య నాయకులుకు జనసేన పార్టీ లోకి చేరిన సందర్బంగ కృతజ్ఞతలు తెలియజేశారు.
=========================