వసంత కృష్ణ ప్రసాద్ ను గెలిపిస్తాం

సిరా న్యూస్,మైలవరం;
వసంత కృష్ణప్రసాదు నాయకత్వం వర్ధిల్లాలంటూ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో నినాదాలు చేసారు. మైలవరం ఎమ్మెల్యే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కి టికెట్ కేటాయించడంతో ఇబ్రహీంపట్నం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ భారీగా బాణసంచా కాల్చారు.
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుని మళ్ళీ అసెంబ్లీకి పంపుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని వారు పేర్కొన్నారు. నిజమైన నాయకునికి తెలుగుదేశం పార్టీ టికెట్ను ఇక్కడ కేటాయించడం చాలా శుభ పరిణామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *