సిరాన్యూస్, ఇంద్రవెల్లి
విద్యార్థులు పట్టుదలతో చదవాలి: అధ్యక్షులు దుర్వ సంతోష్
* విద్యార్థులకు నోట్స్ బుక్స్, చిరు వ్యాపారులకు గోడుగుల పంపిణీ
విద్యార్థులు పట్టుదలతో చదవాలని హైమన్ డార్ప్ -బెట్టి ఎలిజీబెత్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపక అధ్యక్షులు దుర్వ సంతోష్ అన్నారు.శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో హైమన్ డార్ప్ -బెట్టి ఎలిజిబేత్ స్మారక గ్రంథాలయం ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్, పెన్సిల్స్, లను ఉపాధ్యాయులతో కలసి పంపిణి చేశారు.అదే విధంగా వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డుకు ఇరువైపులా వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు తనవంతుగా గోడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా హైమన్ డార్ప్- బెట్టి ఎలిజీబేత్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ మాట్లాడుతూ.విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని,కష్టపడి చదవాలని పేర్కొన్నారు.చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.పేదరికాన్ని నిర్ములించడానికి చదువు ఓక వజ్రయుధం లాంటిందని తెలిపారు.ప్రతి విద్యార్థి పట్టుదలతో చదవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మెస్రం రవీంద్ర,అర్జున్,పూసం నాందేవ్, అన్నపూర్ణ, యువకులు రంగుల రాజు,ఆదిమూలం నరేష్,గారులే కిరణ్,రాజు తదితరులు పాల్గొన్నారు.