సిరా న్యూస్, బోథ్
రోడ్లపై తిరిగే పశువులను కట్టడి చేయండి: మాజీ వార్డు సభ్యులు లింగారెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో రోడ్లపై తిరిగే పశువులను కట్టడి చేయాలని స్థానిక రైతులు సోమవారం ఎంపీడీవో రమేష్ కు వినతిపత్రం అందించారు. పశువుల సంచారం వల్ల గ్రామంలో ఇబ్బందులు పెరగడంతోపాటు గ్రామం సమీపంలో ఉన్న పంట పొలాల్లో తిరిగి పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోయారు. అంతకుముందు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. అందించిన వారిలో మాజీ వార్డు సభ్యులు లింగారెడ్డి, సామాజిక సేవకుడు జక్కుల వెంకటేష్, రైతులు కిషోర్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు