శ్రీకాళహస్తిలో లింగోద్భవ దర్శనం

 సిరా న్యూస్,శ్రీకాళహస్తి;
తిరుపతి జిల్లాలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన శుక్రవారం రాత్రి 12 గం”లకు లింగోద్భవమూర్తి అభిషేకానికి నిర్వహించారు. అభిషేక సమయాన వేలాదిమంది భక్తులు వేచివుండి దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మిషా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు శ్రీకాళహస్తి దేవస్థానం ఇఓ ఎస్.వి నాగేశ్వరరావు దంపతులు లింగోద్భవ మూర్తి సంకల్ప పూజ అభిషేకంలో పాల్గొన్నారు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *