llandula Venkatesh: బాధిత కుటుంబానికి  రూ.1,20,000 ఆర్థిక సాయం 

సిరాన్యూస్‌, సైదాపూర్
బాధిత కుటుంబానికి  రూ.1,20,000 ఆర్థిక సాయం 

ఎవరికి ఎవరూ లేరు అనుకుంటున్న ఈ రోజుల్లో మేమున్నామంటూ బాధిత కుటుంబానికి రూ.1,20,000 ఆర్థిక సాయం చేశారు. సైదాపూర్ మండలంలో మీ సేవ కేంద్రంలో ఇల్లందుల వెంకటేష్ అనే వ్యక్తి పని చేస్తూ ఉండేవాడు. అతనికి భార్య కుమార్తె ,కుమారుడు ఉన్నారు.ఈ నెల 13వ  అతడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో వెంకటేష్ కుటుంబం తీవ్రశోకసంద్రంలో మునిగిపోయింది. వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఎలాగైనా ఆదుకోవాలని దాతలు ముందుకు వచ్చి వారి సహకారంతో 1,20,000/- సేకరించి పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు స్థానిక సైదాపూర్ మండల ఎస్సై ఆరోగ్యం చేతుల మీదుగా బాండ్ ను అందజేశారు. అయన మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చేయడాన్ని చూసి ఎస్సై ఆరోగ్యం వారిని అభినందించారు.దాతలు సహకరించడానికి కృషి చేసిన వాళ్ళలో మునిపాల అశోక్, గడ్డం శేఖర్, పల్లపు బాలకృష్ణ, మండల రమేష్, మేడవేని రమేష్, బేకరీ శ్రీకాంత్, రాఠి ఆర్ట్స్, కట్టోజు సద్గుణాచారి , తాటిపాముల అనిల్ కుమార్, ఈదులకంటి అమరేందర్ రెడ్డి, కాశపాక శ్రీనివాస్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *