LMD: డ్రాఫ్ట్ మెన్ జేటీవో మ్యాడారం రాజేశం మృతి

సిరాన్యూస్,రాజన్న సిరిసిల్ల
డ్రాఫ్ట్ మెన్ జేటీవో మ్యాడారం రాజేశం మృతి
* ప‌లువురు సంతాపం
కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మ్యాడారం రాజేశం(65) బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు .ఈయన ఎల్ఎండీ క్యాంపులో శిక్షకు లుగా, డ్రాఫ్ట్ మెన్ జేటీవోగా పని చేశారు. ఉద్యోగ సమయంలో నాటక రంగంపై ఆసక్తితో నాలుగు దశాబ్దాల కిందట ఎల్ఎండీలో గ్రామ నవోదయ సమితి, నీటి పారుదల శాఖ ఉద్యోగి గోపన్నతో కలిసి శ్రీవేంకటేశ్వర కళాసమితి ప్రారంభించారు. అప్పటి కళాకారులు గోపన్న, నారాయణ, జ్ఞానేశ్వర్, కనకమూర్తితో కలిసి రాజేశం ఎల్ఎండీ రిక్రియేషన్ క్లబ్లో నాటకాలు ప్రదర్శించారు. ఈయన సహచరుడు తిమ్మాపూ రకు చెందిన కేతిరెడ్డి మల్లారెడ్డి టీవీ, సినిమాల్లో నటిస్తున్నారు. మల్లారెడ్డి, మున్ననూరి హను మంతరావు, రాజేశ్వర్రావు, ఎం. రాజు, పబ్బ రాజమౌళి, సత్యనా రాయణ, తదితరులతో కలిసి అక్షర ఉజ్వల, కళా జాతలు, బ్రహ్మోత్సవాలు, నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రాజేశం మృతికి జిల్లా సాంస్కృతిక సంస్థలు, కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు వై. ఎస్.శర్మ, కుమార్ మహర్షి, అనిల్ కుమార్ గౌడ్, కృపాదానం, రఘువీర్సింగ్, కేతిరెడ్డి మల్లారెడ్డి, సంగెం రాధాకృష్ణ, రతనక్కుమార్, రొడ్డ యాద గిరి, మంచాల రమేష్, తదితరులు సంతాపం ప్రకటించారు. అలాగే వేములవాడ నియోజకవర్గ బీఆర్ెస్‌ అభ్యర్థి చల్మెడ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ చల్మెడ లక్ష్మి నరసింహారావు ఎల్ఎండీ కాలనీలో వారి నివాసానికి వెళ్లి రాజేశం చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *