Loka Brothers: ప్రధాని మోడీకి స్వాగతం పలికిన “లోక” బ్రదర్స్

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ప్రధాని మోడీకి స్వాగతం పలికిన “లోక” బ్రదర్స్

విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని “లోక” బ్రదర్స్ ప్రత్యేకంగా కలిసి స్వాగతం పలికారు. పట్టణంలోని ఏరోడ్రం వద్ద మోడీ హెలికాప్టర్ దిగగానే, పలువురు బిజెపి నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి, ఆయన సహోదరుడు జైనథ్ మండలం దీపాయిగూడ ఎంపీటీసీ లోక కరుణాకర్ రెడ్డిలు మోడీకి నమస్కరించి అభివాదం చేశారు. ఈ సందర్భంగా లోక కరుణాకర్ రెడ్డి మోడీతో కొంతసేపు ముచ్చటించారు. తాను ఇప్పటికీ మూడుసార్లు శబరిమలైకి అయ్యప్ప దీక్షలో కాలినడకన వెళ్లానని, మూడోసారి తమరు తప్పక ప్రధానమంత్రి అవుతారని మోడీతో చెప్పారు. దీనికి సంతోషించిన మోడీ “బహుత్ కుషి కి బాత్ హై” అంటూ, కరుణాకర్ రెడ్డిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *