సిరాన్యూస్, ఆదిలాబాద్
అశోక చక్రవర్తి గొప్ప పోరాటయోధుడు : లోక ప్రవీణ్ రెడ్డి
* ఘనంగా సామ్రాట్ అశోక చక్రవర్తి జయంతి వేడుకలు
* పట్టణంలో బైక్ ర్యాలీ
అశోక చక్రవర్తి గొప్ప పోరాటయోధుడని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి అన్నారు. భారతదేశ గొప్ప పోరాటయోధుడు సామ్రాట్ అశోక చక్రవర్తి జయంతి వేడుకలు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిలోక ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ్రాట్ అశోక చక్రవర్తి సంఘం యువకులు లోకా ప్రవీణ్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. అంతకుముందు స్థానిక ఆఫీసర్స్ క్లబ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా లోక ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సామ్రాట్ అశోక చక్రవర్తి గొప్ప పోరాటయోధుడని అన్నారు. అందుకు పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్రను పొందుపరచడమే అందుకు నిదర్శనం అనే పేర్కొన్నారు. అశోక చక్రవర్తి నాడు ప్రజల కోసం చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. నేడు జాతీయ పతాకంలో ఉన్న చక్రం అశోక చక్రవర్తి కి గుర్తింపుని పేర్కొన్నారు. అశోకుడు ఆయన రాజ్యంలో ప్రజలకు చేసినటువంటి సేవలు నేటికీ పాఠ్యపుస్తకాల్లో మనం చదువుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో సామ్రాట్ అశోక చక్రవర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఇందులో తదితరులు పాల్గొన్నారు.