ఖతర్ వాసికి లోకేష్ భరోసా

సిరా న్యూస్,అమరావతి;
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడికి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నా అంటూ ఎక్స్ లో వీడియో వీరేంద్ర కుమార్ పోస్టు చేసాడు. ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనని పడేశారని వీరేంద్ర ఆవేదన పడ్డాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీడియో పోస్ట్ చేసాడు. వీరేంద్ర వీడియో చూసి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని లోకేష్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *