సిరా న్యూస్,విజయవాడ;
యువగళం పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కి అలాంటి సువర్ణావకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని లోకేశ్ సద్వినియోగం చేసుకున్నారా..? లేదా..? అని అంచనా వేయలంటే యువగళం పాదయాత్రను చంద్రబాబు అరెస్టు ముందు, అరెస్టు తర్వాత అని రెండు భాగాలుగా పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తాయి.చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యువగళం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుందని లోకేశ్ సమరశంఖం పూరించారు. యువగళం వెబ్సైట్లో ఇప్పటికీ 400 రోజులు 4 వేల కిలోమీటర్లు అని పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది! అయితే లక్ష్యం పూర్తికాకుండానే, 227 రోజులలో 3132 కిలోమీటర్లు నడిచి పాదయాత్రను ముగించారు.డిసెంబర్ 20వ తేదీన భోగాపురంలో ముగింపు సభను ఏర్పాటు చేస్తున్నారు. అంటే లోకేశ్ నిర్ణయించుకున్న 4 వేల కిలోమీటర్ల లక్ష్యానికి అనుగుణంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లకుండానే పాదయాత్రను ముగిస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయకుండా హడావుడిగా పాదయాత్రను ముగిస్తూ ‘ఆంధ్రులు ఆరంభ శూరులు’ అనే మాటని లోకేశ్ నిజం చేస్తున్నారా అనిపిస్తోంది.పాదయాత్రకు ఆదిలోనే చిత్తూరు జిల్లాలో పోలీసులు పలు ఆంక్షలు విధిస్తూ, మైక్సెట్లను తొలగించినా, లోకేశ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఎన్ని ఇబ్బందులొచ్చినా పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పి పట్టువిడకుండా పాదయాత్రను కొనసాగించారు. అనంతపురం జిల్లాకు చేరేసరికి ఆయన మరింత రాటుదేలినట్టు కనిపించారు.అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేశారు. మీడియా దృష్టిని కూడా తనవైపు తిప్పుకోగలిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి పాదయాత్ర దోహదపడిందనే విశ్వాసం టీడీపీ కార్యకర్తల్లో కలిగింది. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడులలో పాదయాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేసి, అధికార బలంతో తిరిగి టీడీపీ వారిపైనే కేసులు నమోదు చేసినా, వారి ప్రయత్నాలను తిప్పికొడుతూనే లోకేశ్ విజయవంతంగా ముందుకు సాగారు.పాదయాత్రలో భాగంగా డిసెంబర్ 17వ తేదీ వరకు యువనేత లోకేశ్ 70 బహిరంగ సభలలో పాల్గొన్నారు