సిరా న్యూస్,హైదరాబాద్;
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ప్రజాభవన్ వద్ద బారికేడ్ లను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు.. కుమారుడు రాహిల్ తో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పంజాగుట్ట, బోధన్ సీఐలను అరెస్ట్ చేశామన్న డీసీపీ విజయ్.. మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసినట్ల వెల్లడించారు