సిరా న్యూస్, ఆదిలాబాద్:
ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు..
– పట్టించుకోని అధికారులు
– అవస్థలు పడుతున్న అన్నదాతలు
– విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని విన్నపాలు
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో చేన్లకు వెళ్లే విద్యుత్ లైన్ ప్రమాదకరంగా తయారైంది. త్రీ పేజ్ కరెంట్ అందించే 33 కెవి విద్యుత్ లైన్, పలు చేన్లలో వేలాడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్ స్తంభాలు వదులుగా మారి, ఒక వైపు ఒరిగిపోవడంతో ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందో… అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినప్పటికీ కూడా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్వయంగా రైతులే తమ తమ చేన్లలో కర్రల సహాయంతో తాత్కాలిక విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పెను ప్రమాదం ఏదీ జరగకముందే అధికారులు స్పందించి, విద్యుత్ లైన్ సరిచేయాలని రైతులు, స్థానికులు వేడుకుంటున్నారు.