Lord Venkateswara with fruits and vegetables : పులిహోర పూలు,పండ్లు కూరగాయలతో వెంకటేశ్వర స్వామి

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారికి తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ఉత్సవం మూర్తికి అభిషేకం చేపట్టి స్వామివారిని ప్రత్యేకంగా పులిహోర,అప్పం,తీపు కారం,జిలేబి,మినప వడలు,పూలు,పండ్లు, కూరగాయలతో అలంకరించారు. పూజ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.పూజ అనంతరం స్వామివారికి అలంకరించిన పులిహోరను ప్రసాదం రూపంలో భక్తులకు పంపిణీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *