సిరా న్యూస్, చిగురుమామిడి:
జీవాలపై నుండి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ…
+ సుమారు 50 జీవాలు మృతి
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రాత్రి ఓ గ్రానైట్ లారీ జీవాలపై నుండి దూసుకెళ్లింది. చిగురుమామిడి మండల కేంద్రం నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఓ లారీ గొర్లు, మేకల మందను ఢీకొనడంతో దాదాపు 50 జీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో జీవాల యజమానులు కన్నీరు మున్నిరయ్యారు. లక్షల విలువ చేసే తమ జీవాలు మృతి చెందాయని వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.