లారీ, ఆటో ఢీ…ఇద్దరు మృతి

సిరా న్యూస్,ఏలూరు;
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మొగల్తురు నుండి రేపల్లె కు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై ఆటో బోల్తా పడిపోవడంతో తలకు బలమైన గాయాలు తగలడంతో రోడ్డుపై తీవ్ర రక్తస్రావం జరిగింది. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *