సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిగి రోడ్డు నుండి వస్తున్న లారీ బైక్ ను ఢీ కొట్టడంతో బైకు పై ప్రయాణిస్తున్న షాబాద్ మండలానికి చెందిన ప్రదానోపాధ్యాయుడు కృష్ణయ్య వాహనంతో పాటు లారీ కిందికి వెళ్లిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయలవ్వగా హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందాడు. కృష్ణయ్య కొందుర్గు మండలం గాలిగూడ గ్రామంలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు . పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.