మహోన్నత వ్యక్తిని కోల్పోయం

 సిరా న్యూస్,అవనిగడ్డ;
రామోజీరావు మరణంతో తెలుగు జాతి ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని అవనిగడ్డ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వగృహం వద్ధ రామోజీరావు చిత్రపటానికి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్, టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రాభవానికి, తెలుగు జాతి వైభవానికి నిరంతరం పరితపించారన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం రామోజీరావు విశేష కృషి చేశారని, ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృత ప్రచారం కల్పించారన్నారు. తెలుగు మృతభాష కాకూడని రామోజీరావు విశేష కృషి, ప్రోత్సాహం అందచేశారన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం అపూర్వమన్నారు. రామోజీరావు జీవితం వ్యక్తిత్వ వికాస గ్రంధం అన్నారు. ఈనాడు దినపత్రిక స్థాపన ఒక ప్రభంజనం, భారతీయ పత్రికా రంగంలో సంచలనంగా నిలిచిందన్నారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *