ఓయో లాడ్జిలో లవర్స్

ప్రియుడు అనుమానాస్పద మృతి
సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఎస్సార్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శ్రావణ కుమార్ వివరాల ప్రకారం..మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) ఇటుకల వ్యాపారి ఆదే ప్రాంతానికి చెందిన యువతి(27)తో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై రాత్రి ఎస్సార్ నగర్ లోని ఓయో టౌన్ హౌస్ లో గది తీసుకొని బస చేశారుమద్యం తాగి రాత్రి 2 గంటల ప్రాంతంలో హేమంత్ బాత్రూంకు వెళ్లాడు. ఎంతకు బయటకు రాకపోవడంతో యువతి వెళ్లి చూడగా అపస్మారకస్థితిలో హేమంత్ వున్నాడు.
దీంతో యువతి హేమంత్ స్నేహితులకు చెప్పడంతో వారు వచ్చి హేమంత్ ను మంచంపై పడుకోబెట్టి 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే హేమంత్ మృతి చెందినట్టు నిర్ధారించారుమృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ హేమంత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
==========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *