సిరాన్యూస్, బోథ్
లోవోల్టేజీతో తప్పని తిప్పలు…
* ఇబ్బందుల్లో గ్రామస్తులు
* పట్టించుకోని అధికారులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట బి గ్రామంలో కొత్త కాలనీవాసులు ప్రతిరోజు విద్యుత్ సమస్యతో సతమతమవుతున్నారు. కొత్త కాలనీలో విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేస్ కావడంతో తరచుగా సమస్య తలెత్తుతున్నది. రోజంతా విద్యుత్ సరఫరా బాగానే ఉంటున్న రాత్రిపూట మాత్రం కరెంటు తరచుగా పోతుండడంతో ఆరు బయటనే పడుకోవలసి వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారు. రాత్రిపూట ఇదే ట్రాన్స్ఫార్మర్ నుండి వీధిలైట్ల కోసం సరఫరా చేస్తుండడంతో ట్రాన్స్ఫార్మర్ పై విద్యుత్ భారం పడడంతో తరచుగా ఫీజులు ఎగిరిపోవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోతున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. అధికారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకొని విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగే విధంగా చూడాలని కోరుతున్నారు.
విద్యుత్ అధికారులకు తెలిపిన లాభం లేదు….
* అనిరుద్రుడు, కొత్త కాలనీ
ట్రాన్స్ఫార్మర్ పై అధిక లోడు పడుతుందని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై కాలనీ వాసులతో కలిసి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తాము. కరెంట్ కోతలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు ఇకనైనా స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి.