ప్రపంచంలోని అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీ‌య వాది, మేధావి లూయిస్‌ బ్రెయిలీ

సిరా న్యూస్;

-నేడు ఆయన జయంతి, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం

ప్రపంచంలోని అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీ‌య వాది, మేధావి లూయిస్‌ బ్రెయిలీ, ఆయన ఫ్రాన్స్‌ దేశంలో పారిస్‌ నగరానికి 20 మైళ్ళ దూరంలోనున్న మారుమూలలో నున్నటువంటి రాన క్రూవె గ్రామంలో మౌనిక్‌ సైమన్‌ దంపతులకు జనవరి 4, 1809లో జన్మించారు. దారిద్య్ర రేఖకు మైళ్ళ దూరంలోనున్న నిరుపేద కుటుంబం, మౌనిక్‌ సైమన్‌ దంపతులకు ముగ్గురు సంతానంలో చివరి వాడే లూయీస్‌ బ్రెయిలీ. మౌనిక్‌ సైమన్‌ దంపతులు వృత్తిరీత్యా చర్మకారులు. లెదర్‌ ఉపయోగించి జీన్లు, రకాల సామాగ్రి తయారుచేసి చుట్టుపక్క ఊళ్లల్లో అమ్ముకుంటూ పోషణ సాగించేవారు. లూయీస్‌ బ్రెయిలీ చాలా చురుకైనవాడు. మూడు సంవత్సరాల వయసున్నప్పుడే వాళ్ళ అన్న పుస్తకాలు చదివేవాడు. తన తండ్రితో ఒక రోజు గుర్రపు జీన్లు తయారుచేసుకునే వాళ్ళ షాపుకు వెళ్ళాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుకరిస్తున్నాడు. తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం పదునైన కత్తి నాన్నను అనుకరిస్తూ ఉన్న క్రమంలోనే ఎగిరి వచ్చి ఒక కంటిలో గుచ్చుకుంది. స్థానిక హాస్పిటల్‌లో వైద్యునికి తల్లిదండ్రులు చూపించారు. బీదరికం కారణంగా మంచి వైద్యం అందిచ లేకపోవడంతో కంటిచూపు మొత్తం పోయింది. మొదట ప్రమాదానికి గురైన కన్ను కొంత కాలానికే ఇన్‌ఫెక్షన్‌ అయి రెండవ కంటిచూపు తన 5వ ఏట పూర్తిగా కోల్పోయి అంధత్వానికి దారితీసింది. అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశయంతో మౌనిక్‌ సైమన్‌ దంపతులు లూయీస్‌ బ్రెయిలిని అక్క అన్నతో పాటుగా వారి గ్రామంలో నున్న పాఠశాలకు పంపించారు. ఆ పాఠశాలలో బ్రెయిలీ కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తన తండ్రి చెక్కపై మేకుల అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా బ్రెయిలీకి అక్షర జ్ఞానం కలిగించాడు. చదువుకోవాలనే పట్టుదలను తన తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి గురైయ్యేవారు.
ప్రపంచంలో మొదటగా 1784లో వాలంటీస్‌ హవే చేత ప్రారంభం అయిన అంధుల పాఠశాలలో పుస్తకాలు అన్నీ కాగితంపై మేకులతో ఉబ్బెత్తుగా చేసి అంధులు తడిమడం ద్వారా గుర్తుపట్టేట్లు చేసి విద్యాబోధన చేసేవారు. ఈ పుస్తకాలు పెద్దగా బరువుగా ఖరీదైనవిగా ఉండడంవల్ల వీటి ద్వారా విద్యాభ్యాసం సాధ్యపడేది కాదు. దీనితో సంతృప్తి చెందనటువంటి లూయీస్‌ బ్రెయిలి 1821లో చార్లెస్‌ బార్‌ బెరియన్‌ అను సైన్యాధికారి రూపొందించినటువంటి పాఠశాలలో రహస్య డీకోడ్‌ భాష ద్వారా సైనికులకు 12 చుక్కలతో మాత్రమే శిక్షణను ఇచ్చేవాడు. బార్‌ బెరియన్‌ పాఠశాలలో చేరి 12 చుక్కల లిపితో కొంత కాలం చదువుకొనసాగింది. దానితో సంతృప్తి చెందకుండా దానిపై అనేక పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల పరిశోధనల అనంతరం 1832లో అభివృద్ధి చెందిన సరళ పద్ధతిలో చుక్కల లిపిని కనుగొన్నాడు. ఈ లిపికి బ్రెయిలి పేరు మీదగానే నామకరణం చేయడం మూలంగా బ్రెయిలీ లిపి అని పేరు వచ్చింది..లూయిస్‌ బ్రెయిలీ మేధాశక్తికి బహుమతిగా నేషనల్‌ స్కూల్‌ ఫర్‌ ది బ్లైండ్‌ నందు ప్రొఫెసర్‌ పోస్టుకు 1833లో ఎంపికయ్యారు. లూయీస్‌ బ్రెయిలి విద్యార్థులకు హిస్టరి, ఆల్‌జిబ్రా, చరిత్ర పాఠ్యాంశాలు బోధించేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *