ఎం సీ ఈ ఎం ఈ మెకానికల్ ఇంజనీరింగ్ స్నాతకోత్సవం

 సిరా న్యూస్,సికింద్రాబాద్;
భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎం సి ఈ ఏం ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు వెన్నెముకగా నిలుస్తారని రెయిన్ బో ఆస్పత్రి చైర్మన్ రమేష్ కంచర్ల అన్నారు..సికింద్రాబాద్ మిలటరీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల 105 వ స్నాతకోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది.22 మంది అధికారులు ఆర్మీ ఉన్నత అధికారుల చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. రెయిన్ బో ఆస్పత్రి చైర్మన్ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక రక్షణ సవాలనే ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అందించడం, నైపుణ్యాన్ని పెంచే విధంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పట్టభద్రుల కు,మెడల్ సాధించిన వారికి అభినందనలు తెలిపారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత సైన్యంలో మరింత గా వృద్ధి చేసి సైన్యాన్ని పటిష్ఠం చేస్తున్నట్లు తెలిపారు.క్రమశిక్షణ, కష్ట పడే తత్వం,దేశం పట్ల అంకిత భావం వారిలో మరింత స్ఫూర్తిని నింపిందని అన్నారు.సాంకేతికంగా అన్ని అంశాల్లో సైన్యానికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చి వారిలో పరిజ్ఞానాన్ని మెరుగు పరుస్తున్నారని అన్నారు.భారత సైన్యాన్ని ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తిగా మార్చడంలో వారి పాత్ర కీలకమని అన్నారు.అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం దూసుకెళ్తుందని,ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మంచి ఫలితాలు సాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
========================XXX

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *