సిరా న్యూస్, బేల
పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
* సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం గంగన్న
గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం గంగన్న అన్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మే పారిశ్రామిక గ్రామీణ భారత్ బంద్ సీఐటీయూ బేల మండల కమిటీ ఆధ్యరంలో విజయవంతం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.వారు ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని వేతనంతో పనిచేస్తున్నారన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికైనా వారి సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఇన్సూరెన్స్ తో పాటు పనిభారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డి వెంకన్న, కోశాధికారి గన్నె లచ్చన్న, అంగన్వాడి రాష్ట్ర సహాయ కార్యదర్శి సునీత, అంగన్వాడి టీచర్ కే. పద్మ, పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్షుడు మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.