Madavar Harish Reddy: బీసీ గురుకుల పాఠ‌శాల‌ను ప్రారంభించాలి : ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవర్ హరీష్ రెడ్డి

సిరాన్యూస్, బేల‌
బీసీ గురుకుల పాఠ‌శాల‌ను ప్రారంభించాలి : ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవర్ హరీష్ రెడ్డి

బేలలో నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ గురుకుల పాఠశాల భవనం జనవరిలో ప్రారంభం కావలసినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించలేదని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవర్ హరీష్ రెడ్డి ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. అధికారులు నిర్లక్ష్యం వీడి గురుకుల పాఠశాలలో కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్ అనంతరం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకుల పాఠశాల ప్రారంభించిన పక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ స‌మావేశంలో ఏబీవీపీ జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్ ఓం ప్రకాష్, రేసు మనోజ్, రెడ్డి,కృష్ణ, రాజు, అనోజ్ రెడ్డి,సాయి, అశోక్,వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *