Madhamadakala Rajireddy: సంఘం అభివృద్ది కి కృషి

సిరా న్యూస్, చిగురుమామిడి
సంఘం అభివృద్ది కి కృషి
* అధ్యక్షడుగా మధమడకల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా మ్యాదర స్వామి 
* బొమ్మనపల్లి ఆదర్శ పురుషుల పొదుపు సంఘం ఎన్నిక‌
సంఘం అభివృద్ది కి కృషి చేస్తాన‌ని బొమ్మనపల్లి ఆదర్శ పురుషుల పొదుపు సంఘం అధ్యక్షడుగా మధమడకల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా మ్యాదర స్వామి అన్నారు. సోమ‌వారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఆదర్శ పురుషుల పొదుపు సంఘం 23వ వార్షిక మహాసభ గ్రామ పొదుపు సంఘం అధ్యక్షుడు తడా వాసుదేవ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించారు. సైదాపూర్ ఎలక్షన్స్ ఇన్చార్జి పైడిపల్లి రవీందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నికయ్యారు.గతంలో పని చేసిన అధ్యక్షుడు తాడవాసు దేవ రెడ్డి, ఉపాధ్యక్షుడు మామిడి శ్రీనివాస్ ల పదవి కాలం 3 సంవత్సరాలు పూర్తయ్యింది. అనంతరం 2023 సంవత్సరాలు వార్షిక నివేదికను, లాబా నష్టాలు,భవిషత్తు కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ సంఘం అభివృద్ది కి కృషి చేస్తామని తెలిపారు.2024 మార్చ్ నెల నుండి కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల పదవి అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ సమితి అధ్యక్షుడు పోగు రమేష్, పైడిపెల్లి రవీందర్ ఎలక్షన్ ఇన్చార్జి,సిడిఎఫ్ సభ్యులు, గణకులు పెండెల గురువయ్య, మ్యాదరి స్వామి, కత్తుల శ్రీనివాస్, వామసాని వేణు, మామిడి వెంకటయ్య, దరిపెళ్ళి రమేష్,మడమడకల రాజీ రెడ్డి, కొంకట బాలయ్య, విజ్జగిరీ సంపత్, ముత్యాల ఓదెలు, కీసర వెంకటేశ్, మామిడి లక్ష్మణ్,పెద్దపల్లి రవీందర్ పొడుపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *