సిరా న్యూస్,శ్రీకాకుళం;
దువ్వాడ వాణి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రేయసి దివ్వల మాధురి కౌంటర్ ఇచ్చారు. నా వలన దువ్వాడ శ్రీనువాస్ కు ప్రాణహాని ఉందని, వాణి ఆరోపించారు. రెండేళ్లు శ్రీనువాస్ ఆలనా పాలనా నేనే చూసుకున్నా. రెండేళ్లుగా లేని థ్రెట్ ఇప్పుడే వచ్చిందా…? దువ్వాడను చంపడానికి వాణి ప్రయత్నించిందని ఆరోపించారు. 10 మందిని తీసుకొచ్చి ఇంటి తలుపులు పగులగొట్టారు. ఎవరి వల్ల ప్రాణహాని ఉందో అందరికీ తెలుసు. ఇంటి నిర్మాణానికి రూ.2 కోట్లు నేను ఇచ్చా. వాణి నా డబ్బు చెల్లించి ఈ ఇంటిని తీసుకోవచ్చని అన్నారు.