మాదిగ బిడ్డ గజ్జెల కాంతానికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి

-ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్
సిరా న్యూస్,పెద్దపల్లి;
అంబేద్కర్ ఆశయాలను తమ స్వార్థానికి ఉపయోగించుకొని ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యాపారులకు పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కేటాయించి మాదిగలకు అన్యాయం చేయవద్దని మాదిగ శక్తి వ్యవస్థాపకులు, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని నందనగార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సన్ని మాట్లాడుతూ, వ్యాపారాలు, హోదాల కోసం రిజర్వేషన్లలను వాడుకునే వారిని దూరం పెట్టాలని, ఉధ్యమ నేపథ్యం కలిగిన ప్రజా సంఘాల జేఏసి నాయకుడు గజ్జెల కాంతానికే పెద్దపల్లి పార్లమెంటు సీటుని ఖరారు చేయాలని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవల గాంధీభవనులో వెయ్యి మాదిగ డప్పులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. తెలంగాణాలో కుటుంబపాలనను అంతమొందించిన విధంగానే, కాంగ్రెస్ పార్టీలో సైతం కుటుంబ రాజకీయాలను మట్టిలో కలపాలని డిమాండ్ చేశారు. చాలా యేళ్ళుగా మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్న ఆయన రానున్న ఎన్నికల్లో గజ్జెల కాంతం అభర్థిత్వాన్ని ఖరారు చేస్తే మాదిగలతో పాటు అన్నివర్గాల మద్దతు కూడా పొందే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఏఐసిసి కార్యాలయం ముందు మాదిగ డప్పులతో ప్రదర్శన చేపట్టనున్నట్లు వివరించారు. రిజర్వేషన్లను అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన వారు సైతం రిజర్వుడు స్థానాలను ఆశించడం సిగ్గుచేటని విమర్శించారు. మాదిగేతరులకు టికెట్ కేటాయించి మాదిగలను అణగదొక్కే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు పొన్నం సత్తయ్య గౌడ్, తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి, శక్తి జిల్లా కన్వీనర్ కళ్ళేపల్లి రవిమాదిగ, దూడ భూమయ్య, సముద్రాల అజయ్, గజ్జెల ఆనందరావు, సుద్దాల లక్ష్మణ్, గోసిక శంకర్, కొయ్యడ వినోధ్, చొప్పదండి లక్ష్మణ్, మాచర్ల బబ్లూ, ఆర్ణకొండ ఈశ్వర్ దాస్, పల్లురి నాగరాజు, సతీష్, కె రవి, గండి గణేష్ కాసరపు కిరణ్, రాచపల్లి సాగర్, సలిగంటి సాగర్, మారంపెల్లి నర్సయ్య, సనీగారపు రాజ మల్లయ్య, మహేష్, కోమురమ్మ, బిక్షపతి, నగేష్, సందీప్, శ్రీశైలం, హన్మంతు, లింగయ్య, భూమయ్య, అంజయ్య కాంతయ్య, తదితరులు పాల్గొన్నారు.
=====================
23మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం
ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. , ఎమ్మిగనూరు పట్టణంలో 24వ వార్డు నాగప్ప కట్ట లోని స్వామి వారిని ప్రత్యేక దర్శనం చేసుకొని తరువాత వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు.నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి కార్యకర్తను కలుస్తూ పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలకున్న సమస్యలు వింటూ హామీలు ఇస్తూ నన్ను ఆశీర్వదించండి మీకు తోడుగా నేనున్నాను అంటూ చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు లో వైసీపీ జెండా రెపరేపలాడుతుందని ధీమా వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బుట్టా శివనీలకంఠ, రాష్ట్ర శాప్ నెట్వర్క్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వేంకటేష్, 24వ వార్డు కౌన్సిలర్ రామంజినమ్మ, , పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వార్డు సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు. తదితరులు పాల్గొన్నారు.
==================
24పరీక్ష నిర్వహించే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు
పాతబస్తీలో టెన్త్ పరీక్షలు
హైదరాబాద్
హైదరాబాద్ పాతబస్తీలో పదో తరగతి పరీక్షలు నేటి నుండి ప్రారంభం సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి రావడంతో కేంద్రాల వద్ద హడావుడిగా కనిపించింది. మరియు అధికారులు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అరగంట ముందే అనుమతించారు . పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు. టాయిలెట్స్. టాబ్లెట్స్ .ఫ్యాన్స్ ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. మరియు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించి గట్టి బంధవస్తు ఏర్పాటు చేశారు.
====================
25కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ప్రచురించాలి
హైదరాబాద్
హైదరాబాద్ పాతబస్తీ మలక్ పేట లో తెలంగాణ పౌర హక్కుల పరిరక్షణ సమితి మరియు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం లో అధ్యక్షులు రమంజనేయ, సంపత్ మాదిగ లు మీడియా తో మాట్లాగారు. ల్లు కీలక అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభ్యత్వాలను విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చేసుకుని ఆధార్ కార్డ్ లో కులం మతం చేర్చాలని డిమాండ్ చేసారు. భారత కరెన్సీ పై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటో ప్రచురించాలి. అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలి. జీహెచ్ఎంసి c స్వీపర్ ల ఉద్యోగ భద్రత కల్పిస్తూ తక్షణమే పెర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు అంటూ పైన ఉన్న అంశాలను వెంటనే అమలు చేసే విదంగా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు
================
26బీరు బాటిళ్లతో దాడి..యువకుడి మృతి
వికారాబాద్
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చేనుగోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య ఎన్కెపల్లి గేట్ సమీపంలోని ఓ వెంచర్లో బీర్ బాటిల్ తో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది. మృతుడు మన్నెగూడ కు చెందిన సంజీవ్ కుమార్ (38) గా గుర్తించారు. మృతదేహన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
===================
27నెహ్రూ బొమ్మ సెంటర్ లో జనసేన నిరసన
విజయవాడ
విజయవాడ పశ్చిమ సీటు జనసేన పార్టీ పోతిన మహేష్ కేటాయించలేదని జనసేన కార్యకర్తలు నెహ్రు బొమ్మ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. పశ్చిమ గడ్డ పోతిన అడ్డా జనసేన కార్యకర్తలు నాయకులు నినాదాలుచేసారు. ప్లకార్లతో నిరసన తెలియజేసారు ఈ నేపధ్యంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
=================
28 తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా –
చెన్నై, మార్చి 18
తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపారు. అలాగే, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తమిళిసై తమిళనాడు నుంచి పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుంచి తమిళిసై లోక్ సభకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం తమిళిసై చెన్నైకి వెళ్తారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2019 సెప్టెంబర్ 8న తమిళిసై తెలంగాణ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. గవర్నర్ పదవి చేపట్టక ముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. తాజాగా, లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారని సమాచారం.
================
29 సుప్రీంకోర్టుకు కవిత
న్యూఢిల్లీ, మార్చి 18
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను చేర్చారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది ఆన్ లైన్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. అటు, కవితను ఈడీ రెండో రోజు విచారించనుంది. ఆమెతో పాటు కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారుకాగా, తొలి రోజు విచారణలో కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పలు అంశాలపై ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. కవిత కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన సమాచారం ఆమె ముందుంచి పలు చూపించి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ మొత్తాన్ని అధికారులు వీడియో తీశారు. విచారణ అనంతరం నిబంధనల మేరకు ఆదివారం సాయంత్రం కవిత భర్త అనిల్ తో పాటు సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, న్యాయవాది మోహిత్ రావులు ఈడీ కార్యాలయంలో ఆమెను కలిశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఈడీ కార్యాలయం వరకూ వచ్చినా వారు బయటే ఉండిపోయారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ నెల 15న (శుక్రవారం) హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం అదే రోజు సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాదులు కవితను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని వాదించారు. ఇదే క్రమంలో ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కవితను 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23 వరకూ ఈడీ విచారణకు అనుమతించింది. అదే రోజు మధ్యాహ్నం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఈడీ అధికారులను ఆదేశించారు. అయితే, ఆమెను ప్రతీ రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో కలిసేందుకు కుటుంబ సభ్యులకు న్యాయస్థానం అనుమతించింది. అలాగే, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు సైతం వెసులుబాటు కల్పించింది.
====================
30 మంగ్లీ కారుకు ప్రమాదం
హైదరాబాద్, మార్చి 18
ప్రముఖ సింగర్ మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వ్యాన్ ఢీకొనగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. హైదరాబాద్ – బెంగుళూరు జాతీయ రహదారిపై వస్తుండగా.. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
===================
31 మియాపూర్ లో చెడ్డీ గ్యాంగ్
హైదరాబాద్, మార్చి 18
: హైదరాబాద్ నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. గతంలో నగరంలోని ఒకట్రెండు చోట్ల చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడంతో హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరు నిందితులు శనివారం అర్ధరాత్రి మియాపూర్ లోని వరల్డ్ వన్ స్కూల్ లో చోరీ చేశారు. స్కూల్ కౌంటర్ లో ఉంచిన 7 లక్షల 85 వేల నగదును చెడ్డీ గ్యాంగ్ ముఠా దోచుకెళ్లింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు స్కూల్ లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి.
మియపూర్ సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మీడియా సమావేశంలో చెడ్డి గ్యాంగ్ అప్డేట్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 16న ఓ స్కూల్‌లో అర్ధరాత్రి చోరీ జరిగిందని ఫిర్యాదు వచ్చింది. వారి వేషధారణ అంతా చెడ్డి గ్యాంగ్‌లా ఉన్నారు. స్కూల్ లోని కౌంటర్‌లోకి చొరబడి రూ.7 లక్షల 85 వేల నగదును దోచుకెళ్లారుదొంగతనం దృశ్యాలు స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. ఒంటిమీద బట్టలు లేకుండా చెడ్డీలతో దొంగలు వచ్చారు. మొత్తం ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. స్కూలు యాజమాన్యం లో పనిచేసే వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అని కోణంలో కూడా విచారణ చేస్తున్నాం. నిందితుల కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాం. గతంలో కూడా చెడ్డీ గ్యాంగ్ ఈ ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా ఉండడంతో మియాపూర్ ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ’ సీఐ పేర్కొన్నారు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన ఆయన సూచించారు.
====================
32 ముద్రరాక్షసాలతో ఏపీపీఎస్సీ
విజయవాడ, మార్చి 18
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నల తీరుతో అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు. ప్రధానంగా అనువాద, అక్షర, అన్వయ దోషాలు స్పష్టంగా కనిపించారు. ఇవి అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఇంగ్లిష్ నుంచి తెలుగులోనికి అనువదించడంలో ఎక్కువ తప్పులు దొర్లాయి. గూగుల్ ట్రాన్స్‌లేటర్ వాడారా? అన్నట్లు ప్రశ్నల అనువాదం జరిగింది. తెలుగు అభ్యర్థులు ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి అటు ఆంగ్లంలో, ఇటు తెలుగులోని ప్రశ్నలను పలుమార్లు చదివేందుకు సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. కొన్ని సార్లు అనువాదం సరిగ్గా అర్థంకాక అయోమయానికి గురయ్యారు. మరోపక్క గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో మాదిరిగానే గ్రూప్-1 ప్రిలిమ్స్‌లోనూ ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంది. వీటిని అర్థం చేసుకోవడానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టింది. కొన్ని ప్రశ్నలు సివిల్స్ కంటే సంక్లిష్టంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు తెలిపారు. ముఖ్యంగా 63 పేజీలతో ఉన్న పేపర్-1 ప్రశ్నపత్రం అభ్యర్థులకు అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ఆంగ్లం నుంచి తెలుగులోకి ప్రశ్నలను అనువాదం చేయడంలో తరచూ తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదివిన వారు పోటీలో వెనుకబడుతున్నారు.
ప్రశ్నల తీరు ఓసారి పరిశీలిస్తే..
➥ హిస్టరీ విభాగం 22వ ప్రశ్నలో ఇంగ్లిష్ నుంచి తెలుగులోనికి అతివాద దశ అని పేర్కొనడానికి బదులు తీవ్రవాద దశగా అనువాదం చేశారు.
➥ పేపరు-2లో..
– సైన్స్ అండ్ అండ్ టెక్నాలజీ విభాగం ( 66వ ప్రశ్నలో శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించి కొత్త(నావెల్) పరికరం ద్వారా నిర్థారణ పరీక్షలు అన్న ప్రశ్న తెలుగు అనువాదంలో నవల అని ముద్రించారు. దీని వల్ల అర్థం పూర్తిగా మారిపోయినట్లయింది.
– 71వ ప్రశ్నలో ‘విపత్తు’ అనే పదాన్ని ఇవ్వకుండా ఇంగ్లిష్ పదాన్ని అలాగే ఇచ్చారు.
– 109వ ప్రశ్నలో ‘కోస్ట్ గార్డ్ సైనిక విన్యాసాలు’ అని కాకుండా ‘కోస్ట్ గార్డ్ వ్యాయామం’ అని ముద్రించారు.
– 89వ ప్రశ్నలో ‘జీవ విచ్ఛన్నం’ అనే పదానికి బదులుగా ‘స్మార్ట్ బయోడిగ్రేడబుల్’ అని ఇంగ్లిష్‌లోనే యథాతథంగా ఇచ్చారు.
– 90వ ప్రశ్నలో ‘గుండ్రటి రూపం’ అనడానికి బదులు ఇంగ్లిష్‌లోని ‘రింగ్’ అనే పదాన్ని తెలుగులోనూ అదే విధంగా ఇచ్చారు.
– మరో ప్రశ్నలో తెలుగులో ‘భ్రూణం’ అని ముద్రించాల్సి ఉండగా ‘పిండం’ అని ముద్రించారు.
➥ ఇక జైన మతరచనల గురించి అడిగిన ప్రశ్నలో ప్రాకృతంకు బదులుగా కృతాన్ని, జైనులు అనే పదానికి ప్రాజైనులు అని ముద్రణ అయింది. మరోప్రశ్నలో పార్లమెంటరీ విశేషాధికారాలు అని కాకుండా పార్లమెంటరీ అధికారాలు అని అనువదించారు. ఇదే ప్రశ్నలో వైడర్ ఇంప్లికేషన్స్ అనే పదాన్ని విస్తృత పరిణామాలు అని అనువదించడానికి బదులు విస్తృతమైన చిక్కులు‌గా ముద్రించారు.
➥ వర్తమాన అంశాల్లో ఏపీ గురించి 2023 సెప్టెంబరులో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల గురించిన ప్రశ్న వచ్చింది. హిస్టరీ అండ్ కల్చర్ విభాగంలో ఇచ్చిన ప్రశ్నలు గ్రూప్-2 ప్రిలిమ్స్ కంటే కఠినంగా ఉన్నాయి. ఈ విభాగంలో ఇచ్చిన 30 ప్రశ్నల్లో రెండింటిని మాత్రమే నేరుగా అడిగారు.
➥ భారత ఆర్థికవ్యవస్థకు సంబంధించిన పలు ప్రశ్నలు ఒక పేజీని ఆక్రమించాయి. జాగ్రఫీలో వచ్చిన ప్రశ్నలు ఒకటి, రెండుసార్లు చదివి విశ్లేషించుకుని, అవగాహనతో జవాబులు గుర్తించే విధంగా ఉన్నాయి.
➥ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్టులో పర్యావరణంపై అంతర్జాతీయ ఒప్పందాలు, న్యూక్లియర్, జీవవైవిధ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్, ఇతర రంగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఎకానమీలో మౌలిక సదుపాయాల కల్పన ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. ఏపీ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు తక్కువగా ఇచ్చారు.
ఇలా చాలా ప్రశ్నలు తెలుగులో అర్థరహితంగా ఇచ్చారు. ప్రశ్న పత్రంలో ముద్రణా పరంగానూ కొన్ని తప్పులు దొర్లాయి.కాగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల పరిధిలో 301 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో మొత్తం 1,26,068 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 శాతం) మంది , పేపర్-2 పరీక్షకు 90,777 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు పేపర్లు రాసినవారిని మాత్రమే మెయిన్స్ పరీక్షకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్ పరీక్షకు 1: 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
==================
33 చెవి దిద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పు
ఖమ్మం, మార్చి 18
ఎంత అడిగినా చెవి దుద్దులు కొనివ్వడం లేదని ఆ మహా ఇల్లాలు ఏకంగా భర్తకు నిప్పంటించింది. కాలన గాయాలతో భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నిజాంపేటలో షేక్‌ యాకూబ్‌పాషా, సమీనా దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులు ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు బంగారు చెవి దుద్దులు కొనివ్వాలని సమీనా భర్తతో తరచూ పోరు పెట్టేది. ఈ విషయంపై శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో తన వద్ద అంత డబ్బు లేదని, తర్వాత కొనిస్తానని పాషా చెప్పాడు. దీంతో కోపోధ్రిక్తురాలైన భార్య సమీనా ఇంట్లో ఉన్న పెయింట్లకు సంబంధించిన రసాయనాన్ని తెచ్చి పాషాపై పోసి నిప్పంటించింది. మంటలు తెలరేగి పాషా తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టు పక్కల వారు గమనించి మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. పాషా తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలు సమీనాను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటనను నమ్మి ఓ వ్యాపారి దాదాపు రూ.40.67 లక్షల సొమ్ము నష్టపోయాడు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటోన్న ఓ వ్యాపారి మొబలై ఫోన్‌కు ఈ ఏడాది జనవరిలో గుర్తు తెలియని వ్యక్తులు ఇన్‌స్టాలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ పేరుతో ఓ లింక్‌ పంపించారు. ఈ యాప్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని నమ్మించారు. అందుకు ఫోన్‌లో మరో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. దాని ద్వారా ఎంత లాభం వస్తుందో స్వయంగా చూసుకునే అవకాశం ఉంటుందని నమ్మబలికారువారి మాయమాటలు నమ్మని వ్యాపారి తన వద్ద ఉన్న రూ.40.67 లక్షలను గుర్తుతెలియని వ్యక్తుల ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో వారు వ్యాపారి పెట్టుబడికి రూ.19.16 లక్షల లాభాలు వచ్చాయంటూ మరో లింక్‌ పంపించారు. అది పొందాలంటే 15 శాతం ఆదాయపన్ను చెల్లించాలని, లేదంటే మొత్తం నగదు సంస్థకు తిరిగి వెళ్లిపోతుందని తెలిపారు. వారు చెప్పినట్లు చేస్తున్నక్రమంలో పెట్టుబడి ఖాతాలో వారు చూపిన రూ.19.16 లక్షలు ఉపసంహరించుకుని జీరో బ్యాలెన్స్‌ చూపారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌కు (1930) ఫిర్యాదు చేశాడు. ఆదివారం మరోమారు కేయూ పోలీసు స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు.
======================
34. 9కి చేరిన చికెన్ పాక్స్ మరణాలు
తిరువనంతపురం, మార్చి 18
కేరళలో చికెన్ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి.. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుకున్నాయి. వరిసెల్లా-జోస్టర్ వైరస్ ద్వారా చికెన్ పాక్స్ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. మార్చి 15 వరకు రాష్ట్రంలో 6,744 ఇన్ఫెక్షన్ కేసులు, పిల్లలతో సహా తొమ్మిది మరణాలు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత ఏడాది రాష్ట్రంలో మొత్తం నాలుగు మరణాలు, 26,363 చికెన్ పాక్స్ కేసులు నమోదైనట్లు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వద్ద ఉన్న గణాంకాలు చెబుతున్నాయి.ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటువ్యాధి, చికెన్ ఫ్యాక్స్ సోకిన వ్యక్తితో శారీరక సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది’ అని కేరళలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. శిశువులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణీల విషయంలో ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే పిండానికి హాని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, సమస్యలు మరణానికి కూడా దారితీయవచ్చు” అని ఆయన అన్నారు.ఎర్నాకుళం జిల్లాలో చికెన్పాక్స్ కేసులు పెరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని చర్మ గాయాలు నయం అయ్యే వరకు రోగులు తమను తాము ఐసోలేట్ చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించడంలో సహాయపడతారని డాక్టర్ రాజీవ్ చెప్పారు. ఇక కేరళలోని ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సల్ఫీ నూహు మాట్లాడుతూ.. సాధారణంగా వేసవికి ముందు వ్యాప్తి సంభవిస్తుంది. “దాదాపు అన్ని సీజన్లలో ఈ వ్యాధి వ్యాప్తి కనిపిస్తుంది. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలకు అనుగుణంగా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
“వ్యాక్సినేషన్ ఒక వ్యక్తికి చికెన్ పాక్స్ సోకకుండా నిరోధించగలదు. అలాగే మెరుగైన ట్రీట్ మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి” అని డాక్టర్ సల్ఫీ చెప్పారు. చికిత్స ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. అనారోగ్యం తీవ్రతతో చికిత్స ప్రభావం తగ్గవచ్చు. సాధారణంగా వృద్ధులు, కోమార్బిడిటీస్ ఉన్నవారికి వ్యాక్సినేషన్ సిఫార్సు చేస్తారు’ అని డాక్టర్ సల్ఫీ తెలిపారు.
====================xx

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *