సిరా న్యూస్, భీమదేవరపల్లి
భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు
* సమ్మక్క సారలమ్మ జాతర చైర్మన్ మాడుగుల వీరస్వామి
* సమ్మక్క సారలమ్మ జాతర వాల్ పోస్టర్ విడుదల
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమ్మక్క సారలమ్మ జాతర చైర్మన్ మాడుగుల వీరస్వామి తెలిపారు. శుక్రవారం జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మినీ మేడారంగా పేరుగాంచిన ఈ జాతరకు 45 ఏండ్ల చరిత్ర ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో తల్లుల గద్దెల వద్ద జాతర పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరుగనుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్,ఎంపీడీవో వీరేశం, ముల్కనూర్ ఎస్సై సాయిబాబు, ఎంపీఓ నాగరాజు, పంచాయతి కార్యదర్శి పూర్ణచందర్, కాంగ్రెస్ నాయకులు కొలుగూరి రాజు, ఆదరి రవీందర్, కోడూరి సరోజన, జాతర కమిటీ సభ్యులు మాడుగుల గోపి, శ్రీరామోజు సమ్మయ్య, కొదురుపాక శ్రీనివాస్, కాసగొని లలిత వెంకన్న, కొత్తపల్లి సమ్మయ్య యాదవ్, దొంతరబోయిన రవి, రుద్రాక్ష సాంబమూర్తి, సుతారి రాజమౌళి, గుడికందుల సమ్మయ్య, పెంటపుర్తి వీరారెడ్డి, జక్కుల ప్రకాశం యాదవ్, గనబోయిన కొమురయ్య, మాచర్ల సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.