సిరాన్యూస్, బోథ్
పర్యావరణాన్ని కాపాడుద్దాం : బోథ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ బి హుస్సేన్
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుద్దామని బోథ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ బి హుస్సేన్ అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో చెట్ల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు. ప్రతి వ్యక్తి తన వంతుగా రెండు మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో చెట్లు ప్రముఖ పాత్రని పోషిస్తాయన్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యావరణ ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్ రావు దేశ్ పాండే, ఉపాధ్యక్షులు మోహన్ రావు, కార్యదర్శి న్యాయవాదులు ఆడెపు హరీష్, కుమ్మరి విజయ్ తో పాటు కోర్టు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.