సిరా న్యూస్,కర్నూలు;
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మహా రథోత్సవం అంగ రంగ వైభవంగా శ్రీ మఠం పీఠాధిపతులు సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులను మహా రథోత్సవంపై ఆశీనులు చేసి కోలాటాలు, సంస్కృతిక కార్యక్రమాలు, మహిళలు వేషాలు భజ భజంత్రీలు మధ్య మాఢ వీధుల్లో విశేష జనవాహిని మధ్య ఉరేగించారు.శ్రీ రాఘవేంద్రస్వామి 353 వ ఆరాధనోత్సవాలు పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి తెల్లవారుజామున వేద పండితులు తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు నిర్వహించారు. ఉత్సవాలు తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.