బేల, సిరా న్యూస్
తరలి రానున్న భక్తులు
ఘనంగా నిర్వహించనున్న పూజలు
అదిలాబాద్ జిల్లా బేల మండలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో సదల్పూర్ గ్రామ సమీపంలో జంబి జాతర సాగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జాతరకు ముస్తాబవుతుంది మహదేవ్ బహిరందేవ్ దేవస్థాన కమిటీ సదల్పూర్ ద్వారా ఫిబ్రవరి 3న ఉదయం 11:35 నిమిషాలకు అభిషేకం జరుగుతుంది.
బేల మండలంలోని సదల్ పూర్ గ్రామం సమీపంలో ఆరాధ్య దైవంగా కొలిచే మహాదేవ భైరందేవ్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. 55 సంవత్సరాల నుంచి ఈ జాతర జరుగుతుంది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాలు శిల్పాలు ఎంతో అందంగా ఉన్నాయి, మనసులో ఏదైనా కోరుకొని బైరందేవ్ ఆలయంలోని లింగాన్ని ఎత్తితే నెరవేరుతుంది. ఆ లింగం తేలికగా లేస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు ఏడు రోజులు మహదేవ్ భైరమ్ దేవ్ దేవుళ్ళకి నైవేద్యాలు పూజలు చేసి తన మనసులో కోరుకున్న సమస్యలు పాడిపంటలు, పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని మొక్కులు తీర్చుకుంటారు. అతి ప్రాచీనమైన ఈ ఆలయాలు చూడడానికి ఎంతో ఆకట్టుకుంటాయి ఈ ప్రాంగణంలో ఉన్న నీళ్ల బావి నీళ్ళు ఇంకకుండా ఎల్లప్పుడు ఉంటాయని భక్తుల నమ్మకం. అక్కడ కు వచ్చిన భక్తులు ఆ నీళ్లతో రకరకాల వంటకాలు, నైవేద్యాలు చేస్తారు. ఆ బావిని హుండీ నీళ్ల బావి అని కూడా పిలుస్తారు.
వేలాది జనం మదినిండా భక్తి భావం కనుల పండుగగా జాతర వైభోగంగా జరుగుతుంది. ఈ ఆలయాలకు ప్రత్యేకత ఉంది. అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో విశిష్టత కలిగిన ఆలయాలు ఏటా పుష్య మాసం నవమి రోజున ప్రత్యేక అభిషేకాలతో కోరంగే వంశీయులు సదల్పూర్ జాతర ప్రారంభిస్తారు. భైరందేవ్ ఆలయం శిథిల వ్యవస్థలో ఉంది ఆలయ శిఖరం వైభోగం నుంచి నల్లరాళ్లు కూలుతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత ఎడాది సెప్టెంబర్ లో భైరందేవుని విగ్రహం ఆవిష్కృతం అయింది. దేవుడిపై ఉన్న చందనం పడిపోవడంతో స్వామివారి నిజస్వరూపం కనిపించడంతో ఆదివాసీలు భక్తులు దిగులు చెందారు. కానీ ఆలయం ఎప్పుడు బాగవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమిటీ సభ్యులు కలసి పురవస్తు శాఖ కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జనరల్ కి సందేశం పంపగా ఇక్కడ తవ్వకాలు చేపట్టి అన్వేషించాలని కోరారు శిథిల వ్యవస్థకు చేరిన భైరందేవ్ ఆలయాన్ని పున:నిర్మించాలని పురవస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏప్రిల్ 12న రాష్ట్ర అసిస్టెంట్ పురవస్తు శాఖ అధికారి సాయి కృష్ణ ఆలయాన్ని సందర్శించారు, ఆలయ చరిత్ర విశిష్టతజాతర సందర్భంగా భక్తుల పరిస్థితి ఇతర వివరాలు తెలుసుకొని ఆలయానికి సంబంధించిన అన్ని రకాల చిత్రాలు తీసుకున్నారు.. ఆలయాలకు సంబంధించిన నివేదికను తయారు చేసి కేంద్ర కార్యాలయానికి అందిస్తానని ఆ శాఖ అధికారి వెల్లడించిన ఇంకా ఏమి తెలలేదు అని చెపుతున్నారు జిల్లాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆలయ విశిష్టత చరిత్రపై అధ్యయనం చేసిన నివేదికతో పాటు ఆలయాన్ని పునర్ నిర్మించాలని కోరారు.
వారం రోజులపాటు నిర్వహించే ఈ జాతరకు ఆదివాసులు పెద్ద ఎత్తున తరలివస్తారు ఆదివాసులతోపాటు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా కర్ణాటక నుంచి వేలాది భక్తులు ఇక్కడ తరలివస్తారు. జాతర సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు ఇతర ఇతర దేశాల నుండి ఈ పోటీలో పాల్గొంటారు ఈ పోటీలు కనులవిందువుగా సాగుతాయి గెలుపొందిన వారికి నాలుగు రకాల బహుమానాలు అందజేస్తారు మరియు రకరకాల ఆటలు విన్యాసాలు నాట్య కథలు కనులవిందువుగా సాగుతాయి. ఫిబ్రవరి 6న మంగళవారం రోజున ఆదివాసీ దర్బార్ సభ నిర్వహిస్తారు. ఈ దర్బార్లో ఆదివాసుల సమస్యలు, దేవాలయాల అభివృద్ధి గురించి చర్చిస్తారు. చివరి రోజున ఫిబ్రవరి 9న శుక్రవారం రోజున ముగింపు సందర్భంగా దహి హండా కాల, భక్తులకు ప్రసాద పంపిణీ మరియు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు