Mahashivratri Brahmotsavam :శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

సిరా న్యూస్,శ్రీశైలం;
శైవ క్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం నాడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:10 గంటలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈఓ పెద్దిరాజు శ్రీకారం చుట్టారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో యాగశాల ప్రవేశం,వేదస్వస్తి, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణపూజ, దీక్షాకంకణధారణ సాయంత్రం అగ్నిప్రతిష్టాపన,అంకురారోపణ పూజలు జరిగాయి. భక్తుల రద్దీ కారణంగా నేటి నుంచి 11వ తేది వరకు ఆర్జిత సేవలు రద్దు సాధారణ భక్తులకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు రద్దు చేసారు. ఇరుముడి దరించిన శివస్వాములకు మాత్రమే ఐదవతేది వరకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలకు అనుమతి వుంటుంది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దేవస్థానం తరుపున స్వామిఅమ్మవార్లకు అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఆలయంలో భేరిపూజ,భేరితాండవం సకలదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ద్వజపట ఆవిష్కరణ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *