బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

సిరా న్యూస్;

సామాజిక అసమానత,అస్పృశ్యత లపై సమరం చేసిన సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే
-స్త్రీలు చదువుకోవాల్సిందే అని పట్టుబట్టి.. ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త
-బడుగు, బలహీన, పీడిత వర్గాలకు అండగా నిలిచిన పోరాట యోధుడు
-నేడు ఆయన జయంతి
కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు. స్త్రీలు చదువుకోవాల్సిందే అని పట్టుబట్టి.. ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త. బడుగు, బలహీన, పీడిత వర్గాలకు అండగా నిలిచిన పోరాట యోధుడు… మహాత్మా జ్యోతిరావు ఫూలే. భౌతికంగా ప్రపంచాన్ని వదిలి 128 ఏళ్లయినా.. బడుగుల మేలు కోసం పూలే పడిన ఆరాటం… ఇప్పటికీ స్ఫూర్తిని పంచుతోంది. ఇవాళ ఆ మహనీయుడి వర్థంతి సందర్భంగా.. పూలే సేవలను దేశం స్మరించుకుంటోంది.
మహాత్మా జ్యోతిరావు ఫూలే. సమాజంలో అన్ని వర్గాలకూ సమాన హక్కులు ఉండాలనీ.. స్త్రీలు సంఘంలో భాగం కావాల్సిందే అని పోరాటం చేసి.. దేశాన్నే మేల్కొలిపిన మహనీయుడు. అగ్రవర్ణాల నుంచి కుల వివక్షను ఎదుర్కొన్నా.. ఆఖరికి చదువుకునేందుకు పరిస్థితులు సహకరించకున్నా.. అన్నీ తట్టుకుని.. అందరి కోసం జీవితం అంకింతం చేశారు ఫూలే. వెనకబడిన కుటుంబంలో పుట్టి.. చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్న ఫూలే.. సత్య శోధక్ సమాజ్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. బలహీన వర్గాల తరఫున పోరాడారు. వారికి అన్ని హక్కులూ అందాలని గొంతెత్తారు.

ఫూలే బాల్యం కష్టాలతో మొదలైంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో.. 1827 ఏప్రిల్ 11న ఫూలే పుట్టారు. 9 నెలల వయసులోనే ఫూలే తల్లి చిమన చనిపోయారు. తండ్రి గోవిందరావు ఇంకో పెళ్లి వద్దనుకోవడంతో నర్సు సంరక్షణలో పెరిగారు. ఇబ్బందుల మధ్యే.. ప్రాథమిక విద్య పూర్తి చేశారు. చివరికి చదువు మానేసి తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడ్డారు. 12 ఏళ్ల వయసులోనే.. సావిత్రీబాయితో పూలే వివాహం జరిగింది. అప్పటి వరకు.. బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ పెరిగిన పూలే.. పెళ్లి తర్వాత అందరి సంక్షేమం కోసం ఇంటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టారు.

సమాజంలో మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా ఫూలే పని చేశారు. భార్య సావిత్రీబాయికి చదువు చెబుతూ.. మహిళా విద్య కోసం పోరాటం మొదలు పెట్టారు. ఆమె కూడా సహకరించడంతో.. పూలే మరింతగా జనాల్లోకి వెళ్లారు. 1848లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్ ను ఏర్పాటు చేశారు. ఇలాంటిది.. దేశంలో ఇదే మొదటిదని కొందరంటారు. ఇక.. అగ్రవర్ణానికి చెందిన స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్లి.. అవమానానికి గురైన పూలే.. ఆ సందర్భం నుంచి బలహీన వర్గాల తరఫున పోరాటానికి సిద్ధమయ్యారు. కుల, మతాకు అతీతంగా.. ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలంటూ గొంతెత్తారు.

ఫూలే పోరాటానికి సమాజంలోని అన్ని వర్గాలనుంచి మెల్లగా మద్దతు పెరిగింది. ఇదే ఉత్సాహంతో.. 1851లో అమ్మాయిల కోసం పెద్ద స్కూల్ ఏర్పాటు చేశారు. గణితం, చరిత్ర, జాగ్రఫీ బోధిస్తూ… ప్రపంచంపై అవగాహన కల్పించారు. ఇలాంటివే మరిన్ని స్కూళ్లు ఏర్పాటు చేసి బాలికల విద్య కోసం వీలైనంతగా కృషి చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన ఫూలే… వితంతువుల పెళ్లిళ్లకు అండగా నిలిచారు. గర్భవతులుగా ఉన్న వితంతువుల కోసం ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. భార్య సావిత్రీబాయితో కలిసి.. అంటరానితనం రూపుమాపేందుకు జనంలో చైతన్యం పెంచారు.

జీవితాన్ని పూర్తిగా బడుగుల పోరాటానికే అంకితం చేసిన ఫూలే దంపతులకు.. పిల్లలు లేరు. వితంతువుల కోసం ఏర్పాటు చేసిన సేవా కేంద్రం నుంచే ఓ శిశువును దత్తత తీసుకున్నారు. ఆ బాబు డాక్టర్ చదువు పూర్తి చేసి ఫూలే దంపతులు చూపిన మార్గంలోనే సమాజ సేవ చేశారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పేదల సంక్షేమానికి పాటుపడిన మహాత్మా ఫూలే.. 1888 జూలైలో అనారోగ్యంతో మంచాన పడ్డారు. రెండేళ్ల తర్వాత.. ఆరోగ్యం విషమించడంతో.. 1890 నవంబర్ 28న కన్నుమూశారు.

09ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి
ఏలూరు
పశ్చిమ గోదవారి జిల్లా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కంట తడి పెట్టారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మల ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశంలో భావోద్వేకంలో మునుగిపోయారు. టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్థాపంచెందారు. సీటు వేరే ఒకరికి కేటాయించడానికి సిద్ధమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా. రాజకీయాలు విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం చెప్తానని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *