ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలె జయంతి వేడుకలు

-వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం

సిరా న్యూస్,వేములవాడ;
వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో మహాత్మ జ్యోతి రావు పూలె 197వ జయంతి వేడుకలను బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతి రావు పూలె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ మహిళలకు, బడుగు బలహీనర్గాలకు,అగ్ర వర్ణ పేదలకు చదువును అందించిన గొప్ప మహనీయుడని, విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుందని,జ్ఞానం లేకపోతే అభివృద్ది లోపిస్తుందని అభివృద్ది లేకపోతే సంపాదన నశిస్తుందని గాఢంగా విశ్వసించిన గొప్ప మేధావి జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవదూత రజనీకాంత్, ఉపాధ్యక్షులు ప్రతాప సంతోష్, మాజీ అధ్యక్షులు పోత్తూరు అనిల్ కుమార్, పెంట రాజు, కే. విద్యాసాగర్ రావు, గడ్డం సత్యనారాయణ రెడ్డి, గుజ్జె మనోహర్, పంపరి శంకరయ్య ,మహిళ న్యాయవాది అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *