మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు.

సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
పట్టణంలోని స్థానిక సంజీవయ్య నగర్ నందు మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల. నరసన్న మహాత్మా జ్యోతి రావు పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే అంబెడ్కర్ గురువు అని, అలాగే బడుగు, బలహీన వర్గాల వెనుక బాటుతనంకు విద్య లేకపోవటం కారణమని తెలుసుకొని మొదటగా తన భార్య సావిత్రి బాయి పూలే కు విద్య నేర్పించి, ఆ తర్వాత మహిళలందరికి విద్యను అందించిన మహానుభావుడు జ్యోతి రావు పూలే అని తెలిపారు. ఇలాంటి మహానుభావుల ఆశయాల సిద్ధాంతాలలో ప్రతి ఒక్కరు నడవాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వర్కింగ్ బేడా బుడగ జంఘం ప్రెసిడెంట్ రుద్రాక్షల. దస్తగిరి, మాల మహానాడు టౌన్ ప్రెసిడెంట్ ఎద్దుల. చెన్నయ్య, మాల మహానాడు టౌన్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున, దళిత నాయకులు గుడికల్ స్వామి దాస్, గుడికల్ శాంతిరాజు, మాలమహానాడు నాయకులు ముని దీక్షిత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *